నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానిక పోలీసులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు.
మాడుగుల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన భూమిని కొనుక్కొని డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ యాదగిరి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.