న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్ హాస్టల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా తనువు చాలించడం క్యాంపస్లో కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన బాధిత విద్యార్ధిని ఆదివారం నగరంలోని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి అదేరోజు సాయంత్రం హాస్టల్కు తిరిగివచ్చింది.
సోమవారం ఉదయం హస్టల్ సహచరులు ఆమె రూంకు వచ్చి తలుపు కొట్టగా ఎంతసేపటికి బదులివ్వలేదు. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లగా ఆమె సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణాలను తెలుసుకునేందుకు ఆమె కాల్ డిటైల్స్, వాట్సాప్ రికార్డ్ను చెక్ చేస్తున్నామని, కుటుంబ సభ్యులనూ ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :