రంగారెడ్డి : అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లి లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో కారు ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కూడలి వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సాయంత్ర ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు.