బెంగళూర్ : దేశవ్యాప్తంగా ఆన్లైన్ అడ్డగా సైబర్ నేరాలు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. పార్ట్టైం జాబ్ ఆఫర్ పేరుతో స్కామర్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్న ఉదంతాలు పెచ్చుమీరుతున్నాయి. బాధితుల నమ్మకాన్ని చూరగొనేందుకు సైబర్ నేరగాళ్లు ముందుగా కొంత మొత్తం వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తూ ఆపై నిలువునా లూటీ చేస్తున్నారు.
ఇక లేటెస్ట్గా బెంగళూర్కు చెందిన టెకీని స్కామర్లు రూ. 10.5 లక్షలకు ముంచేశారు. పార్ట్టైం జాబ్ ఆఫర్తో కూడిన ఇన్స్టాగ్రాం యాడ్ను క్లిక్ చేయడం ద్వారా మహిళా టెకీ స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ను టెకీ సంప్రదించగా ఆపై టెలిగ్రాం లింక్ పంపారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోని సదరు వ్యక్తిని సంప్రదించగా పెట్టుబడులపై 30 శాతం రిటన్స్ ఇస్తామని నమ్మబలికారు.
దీంతో బాధితురాలు గూగుల్ పే ద్వారా రూ. 7000 పంపగా కొద్ది సేపటికి ఆమె ఖాతాలో రూ. 9100 డిపాజిట్ అయ్యాయి. బాధితురాలు స్కామర్పై నమ్మకం కలగడంతో నిందితులు చెప్పినట్టే భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టేంది. ఆపై మహిళ రూ. 10.5 లక్షలు స్కామర్లకు పంపిన అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళా టెకీ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :