ముంబై: బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించింది. సన్నీ డియోల్ 2022 డిసెంబర్ నుంచి జరిమానా, వడ్డీతో సహా మొత్తం రూ.55.99 కోట్ల రుణం బాకీ పడ్డారని, దీనికి సంబంధించి ముంబైలోని జుహూ (Juhu) ప్రాంతంలో ఉన్న ఆయన విల్లాను రూ.51.43 కోట్ల రిజర్వ్ ధరకు ఈనెల 25న ఈ-వేలం (e-auction) వేయనున్నట్టు ఆదివారం నోటీసులు ఇచ్చింది. విల్లాతో పాటు 599.44 చ.మీలలో ఉన్న సన్నీ డియోల్, ఆయనకు వ్యక్తిగత గ్యారంటీదారుగా ఉన్న ఆయన తండ్రి ధర్మేంద్ర భవనాలను కూడా వేలం వేస్తున్నట్టు అందులో పేర్కొన్నది. అయితే 24 గంటలు గడవక ముందే వేలం నోటీసులను ఉపసంహరించుకోవడం గమనార్హం.
దీనిపై కాంగ్రెస్ (Congress) పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ సాంకేతిక కారణాలు ఎవరి వల్ల తలెత్తాయోనని పార్టీ సీనియర్ నేత జయ్రామ్ రమేశ్ (Jairam Ramesh) వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘తమకు బాకీ పడిన రూ.56 కోట్లను చెల్లించకపోవడంతో బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కు చెందిన జుహూలోని నివాసాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ-వేలానికి ఉంచినట్లు నిన్న మధ్యాహ్నం దేశానికి తెలిసింది.
అయితే ఈ ఉదయం, అదీ 24 గంటలలోపే సాంకేతిక కారణాల వల్ల వేలం నోటీసును బీవోబీ ఉపసంహరించుకున్నట్లు దేశానికి తెలిసింది. అయితే ఈ ‘సాంకేతిక కారణాలను’ ఎవరు ప్రేరేపించారని ఆశ్చర్యపోతున్నారా?’ అంటూ సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విట్టర్)లో జైరాం రమేష్ పోస్టు చేశారు.
Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank.
This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023