Road Accident | ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా – ఆటో ఢీకొట్టుకోగా.. ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులున్నారు. వాహనాలు వేగంగా ఢీకొట్టుకోగా.. మృతదేహాలు వాహనాల్లోనే ఇరుకుపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వాహనాల్లో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా ఎదురుగా వచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా.. మృతదేహాలు అందులోనే చిక్కుకుపోయాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.