బండ్లగూడ:మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం మేరకు షీ టీం పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహాన్ని నిలిపి వేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే…భోజగుట్ట ప్రాంతానికి చెందిన బాలిక (16)కు కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన సాయిప్రసాద్రెడ్డి (25)తో వివాహాన్ని నిశ్చయించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిముస్లాయిగూడ మహెక్ గార్డెన్ ఫంక్షన్హాల్లో వివాహ ఏర్పాట్లు చేశారు.
ఉదయం వివాహం జరగాల్సి ఉండగా మైనర్ బాలికకు వివాహం చేస్తున్నట్లు షీ టీం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఫంక్షన్ హాల్కు చేరుకుని విచారించారు. వివరాలను పరిశీలించగా వధువు వయసు పదహారు సంవత్సరాలు గా నిర్ధారించుకున్న పోలీసులు వివాహాన్ని నిలిపి వేశారు. వధూవరులతోపాటు ఇరు కుటుంబాల సభ్యులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.