పెంట్లవెల్లి, మే 16: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టు వద్ద ఆయన వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండల కేంద్రంతోపాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో దుకాణాదారులు నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు.