రంగారెడ్డి : నాణ్యతలేని, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలోని మడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో వినాయక ట్రేడర్స్ గోదాంపై ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. దాడుల్లో పరిమితికి మించిన విత్తనాల నిల్వలు గడువు ముగిసిన విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు నిల్వ చేయడంతో పాటు గడువు ముగిసిన విత్తనాలను అమ్మాలని ప్రయత్నించిన డీలర్ జెల్ల వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు