మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి మాటూరు గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మధిర మండలం నిధానపురం క్రాస్రోడ్డు సమీపంలో అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో భార్యభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.