తిరుపతి : ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఐతేపల్లి గ్రామం మామండూరు జాతీయరహదారిపై లారీని , కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, మరో వ్యక్తి కారులో ఉన్నారు.
విశాఖపట్నం నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖ వాసులుగా గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.