దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ కాలనీ దయానంద్ కాలనీలో పసుపుల ఆంజనేయులు(45) దారుణంగా హత్య చేసిన సంఘటన విధితమే. అయితే మృతుని కుమార్తె జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో హత్యకు పాల్పడిన నిందితులైన మైసయ్య(45), గంగులు(25), యాదమ్మ(40)లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.