అప్రమత్తతతో కరోనాను తరిమికొట్టాలి
లక్షణాలున్న ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాలి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
కొత్తగూడ/గంగారం, మే 20 : కరోనా బాధితులు ధైర్యం కోల్పోవద్దు..అలాగని నిర్లక్ష్యమూ చేయొద్దు.. అప్రమత్తతతోనే వైరస్ను తరిమికొట్టాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూ చించారు. గురువారం ఆమె కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఐసొలేషన్ కేంద్రాల్లో రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. కరోనా టెస్టులు, పాజిటివ్ వచ్చిన వారికి మందుల అందజేతపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమా ల్లో మంత్రి మా ట్లాడుతూ.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టు లు చేసి, పాజిటివ్ వచ్చిన వారికి మందులు అందజేయాలన్నారు. నిత్యం రోగుల కండీషన్ను పరిశీలించి, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తరలించాలని సూచించారు. కరోనా మరణాలు తక్కువగానే ఉన్నాయని, ఒకరు చనిపోతే లక్షలమంది కోలుకుంటున్నట్లు చెప్పారు. 104 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనా జయించిందని, ప్రజలు భయాందోళనలు వీడి ధైర్యంగా ఉం డాలని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రతిరోజూ కొవిడ్పై సమీక్షిస్తూ రోగులకు కావాల్సిన వసతులు, మందులు అందుబాటులో ఉం చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి సందర్శించి, రోగులకు భరోసా కల్పించినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కరోనాను తరిమికొట్టాలన్నారు. అవసరముంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు. కొత్తగూడ దవాఖానలో అదనంగా వైద్యులను నియమించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బిందు, కొత్తగూడ జడ్పీటీసీ పుష్పలత, ఎంపీపీ విజయారూప్సింగ్, తహసీల్దార్ నరేశ్, గంగారం జడ్పీటీసీ రమ, ఎంపీపీ సరోజన, ఎంపీడీవో శ్యాంసుందర్, తహసీల్దార్ సూర్యనారాయణ పాల్గొన్నారు.