భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో రెవిన్యూ సిబ్బంది బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను పట్టుకున్నారు. రెవిన్యూ అధికారులను చూసిన ఆటో డ్రైవర్ ఆటోను అక్కడే వదిలి పరారయ్యాడు. దీంతో రెవిన్యూ అధికారులు ఆటోను స్వాధీనం చేసుకొని సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలించి, కేసు నమోదు చేశారు.