పరిగి టౌన్ : సెఫ్టీకిట్స్ లేకపోవడంతో తలపై ఇనుప రాడ్డుపడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం పరిగి పోలీస్టేష్న్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన స్సెన్(38) గత కొంత కాలంగా లక్ష్మిదేవిపల్లి గ్రామ సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. యథావిధిగా రోజువారి పనుల్లో భాగంగా విధులకు వెళ్లిన స్సేన్ కంపెనీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు తలపై ఇనుప రాడ్ పడటంతో ఒక్కసారిగా కుప్పకూలాడు.
గమనించిన తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని తోటి కార్మికులు కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.