చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగరి దశరథ (42) టెంట్ మరమ్మతులు చేస్తుండగా కిందపడటంతో సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడు బ్యాగరి దశరథ కమ్మెట ఎక్స్రోడ్ టెంట్హౌస్ నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన పూలపల్లి ఎల్లయ్య నూతన గృహం గృహప్రవేశ కార్యక్రమానికి టెంట్ మెటీరియల్ సప్లై చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో టెంట్ను విప్పే క్రమంలో బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12గంటలకు మృతి చెందాడు.