ఖమ్మం : విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లతో పాటు మరో హోంగార్డును ఏఆర్ హెడ్ కార్టర్కు అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధ్యతారహితంగా విధులు నిర్వహించారనే ఆరోపణలపై అందిన ఫిర్యాదుల మేరకు సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. శాఖపరంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.