పరిగి : పరిగి మండల పరిధిలోని నజీరాబాద్తండాలో పరిగి పోలీసులు మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీరాబాద్తండాకు చెందిన కేతావత్ చందర్ వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నాడన్న పక్కా సమాచారం వచ్చింది. దీంతో పరిగి ఎస్సై విఠల్రెడ్డి తన సిబ్బందితో వెళ్లి మూడు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు.