Road Accident | కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం త్రిసూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇరింజలకుడ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.
Also Read..
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు
Rahul Gandhi | ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
MS Dhoni | ధోనీ మరో ఘనత.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా రికార్డు