ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నుంచి శనివారం రాత్రి గోవా వెళుతున్న ఓడలో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడుల్లో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (23) సహా ఏడుగురిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా క్రూయిజ్ ముంబై చేరుకున్న సమయంలో మరోసారి జరిపిన దాడుల్లో పెద్దమొత్తంలో డ్రగ్స్ను సీజ్ చేశారు.
రెండు రోజుల తర్వాత ఓడ ముంబై చేరుకుందన్న సమాచారంతో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు ఎన్సీబీ అధికారులు ఓడపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ పిల్స్, రూ 1.33 లక్షల నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. ముంబై ఎన్సీబీకి చెందిన 20 మంది అధికారులు కస్టమర్ల తరహాలో ఓడలోకి చేరుకుని దాడులు చేపట్టారు. తాజా దాడుల్లో 8 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.