వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ని ఎస్సై అనిల్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా మండల కేంద్రంలో శనివారం జరిగిన దుర్గాదేవి శోభాయాత్రకు బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ అమరేందర్కు స్వల్ప గాయాలయ్యాయి.
ఎస్సై అనిల్ రెడ్డి ప్రమాదం తప్పింది. ఐషర్ వాహన డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ వేగంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న రోడ్డు డివైడర్ను పోలీసు జీపు ఢీకొని ధ్వంసమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రైనీ ఎస్సై భవాని తెలిపారు.