పాల్వంచ :మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్కు చెందిన తోనగర్ కిషన్ (35) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా భార్యా,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో మళ్లీ భార్యాభర్తలు గొడవపడ్డారు.
రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన కిషన్ తమ ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన భార్య కల్యాణి బయటికి వచ్చి చూడగా వేపచెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ ఎస్సై రతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.