ముంబై : అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్గా చెప్పుకుంటూ ఓ సబ్ఇన్స్పెక్టర్ను రూ 15,000కు మోసగించిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పింప్రి చించ్వాద్ ప్రాంతంలో అక్రమ ఆయుధ వ్యాపారానికి సంబంధించిన సమాచారం ఇస్తానంటూ డబ్బు వసూలు చేశాడు.
నిందితుడిని ముంబైలోని గోరేగావ్కు చెందిన ఖలీలుల్లా అమానుల్లా ఖాన్గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 28 మధ్య నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్నని, పింప్రి చించ్వాద్ పోలీస్ చీఫ్ స్నేహితుడినని చెబుతూ సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి అక్రమ ఆయుధ వ్యాపారంపై సమాచారం ఇస్తానని రూ 15,000 డిమాండ్ చేశాడు.
నిందితుడు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తాను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్నని క్రైమ్ బ్రాంచ్లోని పోలీస్ అధికారుల నెంబర్లు కావాలని అడిగాడు. ఆపై నిందితుడి కదలికలపై అనుమానం రావడంతో పోలీస్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ముంబైలోని గోరేగావ్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.