కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్నగర్లో చిలుకూరి మనోహర్రెడ్డి(42) చంద్రవతమ్మ దంపతులు నివసిస్తున్నారు.
మనోహర్రెడ్డి బాచుపల్లిలోని రెడ్డిస్ ల్యాబ్లో మేనేజర్గా పనిచేస్తూ బాచుపల్లిలో గది అద్దెకు తీసుకుని ఆఫీస్ కు వెళుతుంటాడు. జూలై 31న సర్దార్పటేల్నగర్కు వచ్చిన అతను ఇంటి అద్దె చెల్లించి వెళ్లిపోయాడు. ఈనెల 2 నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్ రావడం.. బంధుమిత్రులను విచారించినా ఫలితం లేకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.