పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లాదుర్గం మండల పరిధిలోని సీతానగర్ తండాకు చెందిన సంతోష్నాయక్ (30) పెద్దశంకరంపేట పట్టణంలో పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు బైక్పై వచ్చాడు.
తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కోళ్లపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.
మృతుడి తండ్రి మాన్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్డం నిమ్తితం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. సంతోష్నాయక్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.