మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల నాని (28) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. భర్త చిత్ర హింసలు భరించలేని భార్య అనిత అలియస్ సోనీ భర్త ను హతమార్చాలని అనుకుంది.
ఈ నేపథ్యంలోనే ఈనెల 13న అనిత, ఆమె తల్లి తిరుపతమ్మలు కలిసి నాని పై పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాలకు గురైన ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.