హైదరాబాద్ : లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సమీపంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిఫ్ట్ అడగ్గా.. లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత బైక్తో పరారయ్యాడు. మృతుడిని చింతకాని మండల వాసిగా జమాల్ సాహెబ్ (40)గా గుర్తించారు. దుండగుడు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది.