అమరావతి : గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన నరేశ్ ఈ ఉదయం నులకపేటలోని తన భార్య ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య తరఫు బంధువులతో మాట్లాడుతుండగా భార్య, అత్తామామలను వేధిస్తున్నావంటూ నరేశ్పై అందరూ కలిసి విచక్షణారహితంగా దాడిచేశారు. దెబ్బలు తాళలేక అపస్మారకస్థితికి చేరడంతో చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేశ్ భార్యతోపాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.