అమరావతి : కర్నూల్ జిల్లా నంద్యాలలోని వైఎస్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగన్ మోహన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. ఆదివారం తెల్లవారుజామున ఘటన జరగ్గా ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్టీం ఆధారాలు సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్యకు పాతకక్షలే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.