రెండేండ్లలో పట్టణ రూపురేఖలు మార్చుతా
పని చేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 21 : రెండేండ్లలో నకిరేకల్ను అన్నివిధాల అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలను మార్చుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మినీ స్టేడియంలో పర్యటించి మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, పెండింగ్లో ఉన్న పనులను త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో క్రీడాకారులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించి మోడల్గా తీర్చిదిద్దుతానని తెలిపారు. నకిరేకల్ పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, అందుకు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నడికుడి వెంకటేశ్వర్లు, మాద నగేశ్, నవీన్రావు, వెంకటేశ్వర్లు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, గుర్రం గణేశ్, పల్లె విజయ్, సునీల్, బండమీద శంకర్ పాల్గొన్నారు.