వరంగల్ : యువతిపై పెట్రోల్ పోసి హత్యకు పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే..2019 సంవత్సరంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీంనగర్ ప్రాంతంలో హాస్టల్ వద్ద తనను ప్రేమించడం లేదనే అక్కసుతో తోపుచర్ల రవళి అనే యువతిపై నిందితుడు పెండ్యాల సాయి అవినాష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో నిందితుడికి జీవితఖైదు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానాను విధిస్తూ మూడో అదనపు కోర్టు, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.శైలజ తీర్పును వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా