కొత్తూరు రూరల్/రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్(25), మమత(24) అన్నా చెల్లెలు. మమతకు వివాహం కాగా, భర్త అమరేందర్ రెడ్డితో కలిసి కూకట్పల్లిలో నివాసముంటున్నది. ఖిల్లా గణపూర్లో జరిగే తమ బంధువుల వివాహానికి అన్నాచెల్లెళ్లు బైక్ పై వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు.
ఈ క్రమంలో కొత్తూరు మండల కేంద్రంలోని ఐవోసీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే హైదరాబాద్ వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ అదుపు తప్పి లారీ టైర్ల కింద పడిపోయారు. లారీ వారి పై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి