Speeding Car | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డుపక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుంద్
(Mulund) ప్రాంతంలో మంగళవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో అమ్రేష్ యాదవ్
(Amresh Yadav) అనే 22 ఏళ్ల వ్యక్తి కారులో అతి వేగంగా వస్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తుకారాం సావంత్ (76), మరో స్కూటర్ డ్రైవర్ ను తన కారుతో బలంగా ఢీ కొట్టాడు. ఘటన అనంతరం అమ్రేష్ యాదవ్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఈ ప్రమాదంలో సావంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన స్కూటర్ డ్రైవర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read..
bridge collapses | బీహార్ లో కూలిన మరో వంతెన.. నెల వ్యవధిలో మూడో ఘటన
Parliament monsoon session | జులై మూడో వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Asin | ఇందు కోసం 5 నిమిషాల సమయం వృధా.. విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన గజినీ భామ