బంజారాహిల్స్ : ఇంటిముందు ముగ్గులు వేసుకుంటున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి (43) అనే మహిళ బుధవారం ఉదయం 6గంటల ప్రాంతంలో ఇంటిముందు ముగ్గు వేసుకుంటోంది.
అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నారు.