పుణే: కొండంత లక్ష్యాన్ని ఇంగ్లండ్ మంచినీటి ప్రాయంగా కరిగించింది. తొలి వన్డేలో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి కసిదీరా బదులు తీర్చుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయాన్ని సాధించిన ఇంగ్లండ్ టైటిల్ రేసులో నిలిచింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా… రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో రీస్ టాప్లీ, టామ్ కరన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాపార్డర్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్ స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) దీటైన ఆటతో ఇంగ్లండ్ విజయానికి బాటలు వేశారు. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్ (21 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మలాన్ (23 బంతుల్లో 16; 1 ఫోర్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. ప్రసిధ్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్కు ఒక వికెట్ దక్కింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐపీఎల్ నుంచి శ్రేయస్ ఔట్..త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తానని ట్వీట్
2022 ఐపీఎల్లో ఆడనున్న పాకిస్తాన్ క్రికెటర్లు..?!
త్వరలోనే ఇండియా, పాకిస్థాన్ టీ20 సిరీస్!