ముంబై : ఐపీఎల్లో ఆడాలనే పాకిస్తాన్ క్రికెటర్ల కల 2022 లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంత సవ్యంగా జరిగి ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడటం మనం చూడొచ్చు.
పాకిస్తాన్ ఆటగాళ్తు 2008 మొదటి సీజన్.. తొలి, చివరి అవకాశంగా నిలిచింది. అప్పుడు 12 మంది పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్లో ఆడారు. 14 సంవత్సరాలుగా ఒక్కరు కూడా ఐపీఎల్లో ఆడలేదు. వచ్చే ఏడాది దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి ఈ ఏడాది భారత్-పాకిస్తాన్ 3 టీ 20 సిరీస్ ఆడతాయని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. దీని తరువాత టీ-20 ప్రపంచ కప్ భారతదేశంలో జరుగనున్నది. ఇందుకోసం పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానున్నది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా ఐపీఎల్లో ప్రవేశం పొందవచ్చని భావిస్తున్నారు.
ఐపీఎల్ మొదటి సీజన్ 2008 లో 8 జట్లతో జరిగింది. 5 జట్లలో మొత్తం 12 మంది పాకిస్తాన్ క్రికెటర్లు మొదటి టోర్నమెంట్ ఆడారు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (కేఎక్స్ఐపీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) మాత్రమే పాకిస్తాన్ క్రికెటర్ను చేర్చుకోని జట్లుగా నిలిచాయి. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో అత్యధికంగా నలుగురు పాకిస్తాన్ క్రికెటర్లు ఆడారు.
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లో ముగ్గురు, ఢిల్లీ డేర్డెవిల్స్ (డీడీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇద్దరు చొప్పున పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకున్నాయి. హైదరాబాద్కు చెందిన డెక్కన్ ఛార్జర్స్ (డీసీ) లో షాహిద్ అఫ్రిది ఉన్నారు.
ఐపీఎల్ తొలి సీజన్లోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ఒక మ్యాచ్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అప్పుడు అతను రాజస్థాన్ తరపున ఆడాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో తన్వీర్ 4 ఓవర్లలో 14 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. అతని రికార్డును 11 ఏండ్లలో వెస్టిండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ముంబై తరఫున ఆడిన జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.
బెంగాల్లో మిథున్ చక్రవర్తి మెగా రోడ్షోలు
గెలిపిస్తే అయోధ్య యాత్ర తీసుకెళ్తానని హామీ.. ఈసీ నోటీసులు
ఒర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సైనా
వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపేయవద్దంటున్న స్మోకింగ్ ప్రియులు
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..