భూపాలపల్లి : కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింది.
గణపురం గ్రామానికి చెందిన బండారి ఓదెలుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మితో ఓదేలుకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో మంగళవారం ఆమెను గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బండరాయితో కొట్టి పాశవికంగా హత్య చేశాడు.
అనంతరం పోలీస్ స్టేషన్లో వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కుటుంబ వివాదాలే కారణమా.? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి