నల్లగొండ : నల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చర్చికి వచ్చే యువతులు, మహిళలను లోబర్చుకున్నట్లుగా సమాచారం.
మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో విలియమ్స్ బాగోతం వెలుగులోకి వచ్చినట్లు తెలుసున్నది. అయితే విలియమ్స్ ను విచారిస్తున్న క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. తనకు గుండెపోటు వచ్చిందంటూ దవాఖానలో చేరాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు వన్ టౌన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా ఎన్ని టీ20 మ్యాచ్లు నెగ్గిందో తెలుసా?
Leopard attack | చిరుత దాడిలో ఆవు మృతి