Shamshabad Airport | రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు( Customs Officials ) భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్( Dubai ) నుంచి వచ్చిన నలుగురు మహిళల వద్ద 3,175 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం( Gold ) విలువ 1.94 కోట్లు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు( Shamshabad Police ) అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.