Delhi Gangrape Case | దేశ రాజధానిలో దారుణం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజునే ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి.. చెప్పులదండ వేసి మరి ఘోరంగా అవమానించారు. అంతటితో ఆగకుండా ఆమె మొఖంపై కొడుతూ నడిరోడ్డుపై ఊరేగించారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఈ ఉదంతానికి అసలు సూత్రధారులు మహిళలే కావడం. బాధితురాలిపై పగతోనే నలుగురు మహిళలు ఇంత పాశవికంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని వివేక్ విహార్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్కు చెందిన మహిళకు ఇప్పటికే పెండ్లయి.. ఒక బిడ్డ కూడా ఉంది. ఈ విషయం తెలిసి కూడా కొద్ది నెలల క్రితం వరకు ఒక యువకుడు ఆమె వెంట తిరిగేవాడు. కానీ ఆమె పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆ యువకుడు గత ఏడాది నవంబర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యువకుడి చావుకు సదరు మహిళనే కారణమని అతని కుటుంబసభ్యులు ఫిక్సయ్యారు. ఆమెపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే రోజున ఆమెను అపహరించి.. గ్యాంగ్ రేప్ చేయించారు. అయినా వారి కోపం చల్లారలేదు. దీంతో అత్యాచారం అనంతరం ఆమె జుట్టు కత్తిరించి.. నడిరోడ్డుపై చెప్పుల దండ వేసి అవమానించారు. ముఖంపై కొడుతూ నడిరోడ్డుపై ఊరేగించారు.
ఈ విషయం బాధితురాలి సోదరి ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను కాపాడారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాధితురాలిపై దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. బాధితురాలిపై దాడి చేసిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితురాలిపై దాడికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ ఉపేక్షించవద్దని ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ ( ) స్వాతి మలివాల్ నోటీసు జారీ చేసింది.
వివేక్ విహార్లో జరిగిన ఈ ఉదంతంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సీరియస్ అయ్యారు. ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య అని.. క్రిమినల్స్కు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ను ఆయన కోరారు. ఇలాంటి నేరపూరిత చర్యలను ఢిల్లీ ప్రజలు ఏ మాత్రం సహించరని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
తొమ్మిదో తరగతి విద్యార్థినిపై 12th class student లైంగిక దాడి..
రాజేంద్రనగర్ విషాదం.. మాజీ భర్త వేధింపులతో మహిళ ఆత్మహత్య
దారుణం : భార్యతో గొడవపడి ఏడాదిన్నర చిన్నారిని చిదిమేశాడు!
అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ..దవాఖానకు తరలింపు