న్యూఢిల్లీ: ఇది కాలం తెచ్చిన మార్పా? అరచేతిలోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడంతోనా? లేదా తల్లిదండ్రులు తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తున్నందుకా? వయస్సుతో సంబంధంలేదు.. చిన్నతనంలోనే దొంగతనాలు, హత్యలు, కొట్లాటలు, లైంగిక దాడులు.. ఇలా తాము అనుకున్నది చేసేస్తున్నారు. వ్యసనాలకు బానిసలై అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం!
ఓ స్కూల్ విద్యార్థి తన సహచర విద్యార్థినిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని దుర్గాపూర్ జిల్లాలో జరిగింది. ఈ నెల 24న బిచివారాలో ఉన్న ఓ స్కూల్లో మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టారు. దీంతో 9వ తరగతి చదుతున్న బాలిక అన్నం తినడానికి తరగతి గది నుంచి బయటకు వచ్చింది. అదే పాఠశాలలో 12వ తగరతి విద్యార్థి ఆమెను స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. బలవంతంగా బైక్పై ఎక్కించుకుని ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమెపై గంటల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం బైక్పై తీసుకొచ్చి ఆమె ఇంటిముందు పడేశాడు.
దీంతో రక్త స్రావమవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆమె దవాఖానకు తీసుకెళ్లారు. తనపై జరిగిన అమానుషాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బిచివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామని డీఎస్పీ రాకేశ్ కుమార్ శర్మ తెలిపారు.