హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు. అయితే అభిప్రాయబేధాలు రావడంతో మూడు నెలల క్రితం ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి అతడు షాజహాను వేధిస్తుండటంతో బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాజహా బేగం ఆత్మహత్య చేసుకున్నది.