పంజాబ్ : భార్యతో ఘర్షణకు దిగిన వ్యక్తి ఆవేశంతో ఏడాదిన్నర కొడుకుని హత్య చేసిన ఘటన పంజాబ్లోని హోషియార్పూర్లో వెలుగుచూసింది. యూపీకి చెందిన దేశరాజ్ సునీల్ కుమార్ హోషియార్పూర్లోని గురుతేజ్ బహుదూర్ పార్క్లోని ఓ ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఓ విషయంలో దంపతులిద్దరూ మంగళవారం రాత్రి ఘర్షణ పడ్డారు.
గొడవ పెద్దది కావడంతో నిందితుడి భార్య ఇంటినుంచి బయటకు వెళ్లడంతో ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. కోపంతో ఊగిపోయిన నిందితుడు చిన్నారని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి మరణించాడని స్ధానిక ఎస్ఐ తెలిపారు.
కేసు నమోదు చేసి నిందితుడు సునీల్ కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు. మరో ఘటనలో మద్యం తాగి ఇంటికి వచ్చిన వ్యక్తి భోజనం పెట్టాలని భార్యను కోరగా ఏదో పనిలో ఉండి ఆమె ఆలస్యం చేసిందని గొంతు పిసికి చంపిన కసాయి ఉదంతం నోయిడాలో వెలుగుచూసింది.