జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అడవి పంది దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కొoతo లక్మి అనే మహిళా రైతు తోటలో పనిచేస్తుండగా ఆమెపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో సదరు మహిళ చేతి వేలు తెగి పోయి తీవ్రంగా గాయపడిండిది.
గుర్తించిన స్థానికులు లక్ష్మిని జగిత్యాల హాస్పిటల్కి తరలించారు. కాగా, అడవి పంది మళ్లీ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.