Road Accident | నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు సైతం ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మద్దిగూడ ప్రసాద్ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొడుకు అవినాష్తో కలిసి బైక్పై స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతపల్లి వద్ద కారు ఢీకొట్టింది. అనంతరం కారు సైతం బోల్తాపడింది.
ప్రమాదంలో తండ్రీ కొడుకులు ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. గాయపడ్డ వారిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మార్గంమధ్యలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు రమణమ్మ (35), మద్దిమడుగు అవినాష్ (12), పట్నపు మణిపాల్ (18) వనం మల్లికార్జున్ (12)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.