Road Accident | జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కౌగ్ నుంచి డానీ పెరోల్కు వెళ్తున్న మినీ బస్సు.. బిలావర్లోని ధను పరోల్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన 15 మందిని బిలావర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
J&K | Five people killed, 15 injured after their passenger vehicle fell into a deep gorge at Dhanu Parole village in Billawer area in Kathua last night: Police Control Room, Kathua pic.twitter.com/fFb7paSN0j
— ANI (@ANI) January 21, 2023