న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వినయ్ మార్గ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్స్లో శనివారం ఉదయం 11.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పోలీస్ హెడ్క్వార్టర్స్ ప్రాంగణంలో షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
ఘటన సమాచారం అందగానే మూడు అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఎవరూ గాయపడిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.