Hyderabad | హైదరాబాద్ : కూకట్పల్లి పరిధిలోని హైదర్నగర్లో శుక్రవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. జెమ్ మోటార్స్లోని పెయింటింగ్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను ఆర్పేసింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.