సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచెందగా భర్త, చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మృతులు తల్లి స్నేహ(40), కూతురు హన్సిక(15). ఆర్థిక సమస్యలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.
అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోడెపల్లిలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.