జైపూర్ : లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈడీ అధికారిని (Enforcement Directorate) రాజస్ధాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. మధ్యవర్తి ద్వారా రూ. 15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఈడీ అధికారిని ఏసీబీ బృందం అరెస్ట్ చేసింది.
రాజస్ధాన్లో ఈడీ అధికారికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేపట్టిన క్రమంలో దర్యాప్తు ఏజెన్సీ అధికారి నావల్ కిషోర్ మీనాను అదుపులోకి తీసుకున్నారు.
ఆదాయాన్ని మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో నావల్ కిషోర్ మీనాపై నిఘా పెంచిన రాజస్ధాన్ ఏసీబీ ఆయనను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. మీనా అరెస్ట్కు సంబంధించి రాజస్ధాన్ ఏసీబీ అదికారులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
Read More :
Shruti Haasan | 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడం నేరమా? : శ్రుతి హాసన్